తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు వేల సంఖ్యలో పోటీ పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్ పీఎస్సీ) 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించగా, నిన్నటి (సోమవారం) వరకు.. ఈ 8 రోజుల్లో 56,282 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్ పీఎస్సీ అధికారులు తెలిపారు. అయితే ఈ నెలాఖరు వరకు గడువు ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2,85,741 మంది అభ్యర్థులు ఓటీఆర్లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని, వీరిలో 91,366 మంది కొత్తవారని అధికారులు వెల్లడించారు. అలాగే 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్లు ఇచ్చిన అనంతరం ఇప్పటివరకు 2.38లక్షల దరఖాస్తులు వరకు అందాయని అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ