ఆంధప్రదేశ్ ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. నాడు నేడులో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టూ ఆంధ్రకు, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం, అవంతి గ్రూప్ రూ.2 కోట్ల విరాళం అందించాయి. ఈ మేరకు దేవి సీ ఫుడ్స్ ఎండీ పోట్రు బ్రహ్మనందం, అవంతి గ్రూప్ సీఎండీ అల్లూరి ఇంద్రకుమార్ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలుసుకుని విరాళానికి సంబంధించిన డీడీలు, సంబంధిత పత్రాలను అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ