బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించి, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించనుంది. అలాగే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటో గా తీసుకొని డీజీపీని మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ మహిళా కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE