కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు (మార్చి 11, శనివారం) రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 8.25 గంటలకు హకీంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్న అమిత్ షాకు గవర్నర్, డీజీపీ, పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి అమిత్ షా నేరుగా రోడ్డు మార్గంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, హకీంపేట్ లోని నేషనల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ) చేరుకొని, శనివారం రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక మార్చి 12, ఆదివారం ఉదయం ఎన్ఐఎస్ఏలో జరగనున్న సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ కు ముఖ్యఅతిధిగా అమిత్ షా హాజరు కానున్నారు.
సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ కార్యక్రమం ఆదివారం ఉదయం 7.15 గంటలకు ప్రారంభమవనుండగా, రెండున్నర గంటల పాటుగా కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం నుంచి అమిత్ షా కేరళ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. కాగా ఈ పర్యటనలో అమిత్ షాతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంపై స్పష్టత రావాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE