తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడియం శ్రీహరితో పాటుగా ఆయన ఇద్దరు గన్మెన్లకు, పీఏ, డ్రైవర్కు కరోనా పాజిటివ్ గా తేలినట్టు వైద్యులు నిర్ధారించారు. కడియం శ్రీహరి కొన్ని రోజులుగా హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాక, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu