తెలంగాణలో ఎన్నిక ఏదైనా ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని మరోసారి రుజువైంది – ఎమ్మెల్సీ కవిత

Munugode By-poll Win Proves Once Again Telangana People Stands Along with CM KCR Says TRS MLC Kavitha, Munugode By-poll Win Proves Once Again, Telangana People Stands Along with CM KCR, Says TRS MLC Kavitha,Mango News,Mango News Telugu,Munugode Bypoll Elections, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode Election Schedule Release, Telangna Bjp Party, Telangna Congress Party, Trs Cadre For Working In Munugode By-Poll, Trs Working President Ktr, Trs Working President Ktr Thanked Party Leaders Cadre For Working In Munugode By-Poll, Ysrtp

తెలంగాణలో ఎన్నిక ఏదైనా ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నిలుస్తారని మరోసారి రుజువైందని, దీనికి మునుగోడు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమని పేర్కొన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ శ్రీ నీల‌కంఠేశ్వ‌రుడి స‌న్నిధిలో కుటుంబీకులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని, ఎంతో మహిమగల నీలకంటేశ్వరుడిని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక నల్లగొండలో టీఆర్ఎస్‌ హ్యాట్రిక్ సాధించిందని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలని అన్నారు. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని, టీఆర్ఎస్ వైపే నిలుస్తారని తనకు విశ్వాసం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 13 =