తెలంగాణలో ఎన్నిక ఏదైనా ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నిలుస్తారని మరోసారి రుజువైందని, దీనికి మునుగోడు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనమని పేర్కొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ శ్రీ నీలకంఠేశ్వరుడి సన్నిధిలో కుటుంబీకులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక నీలకంటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని, ఎంతో మహిమగల నీలకంటేశ్వరుడిని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక నల్లగొండలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలని అన్నారు. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని, టీఆర్ఎస్ వైపే నిలుస్తారని తనకు విశ్వాసం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE