తెలంగాణలో పాలిసెట్-2022 ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 118 కాలేజీల్లో 20,695 పాలిటెక్నిక్ సీట్లను విద్యార్థులకు కేటాయించారు. కాగా మొదటి విడత చేపట్టిన కౌన్సెలింగ్లో భాగంగా 7,388 సీట్లు మిగిలిపోయాయి. రెండవ విడత కౌన్సెలింగ్లో వీటిని భర్తీ చేయనున్నారు. అయితే మొదటి విడత కౌన్సెలింగ్లో రాష్ట్రంలోని 26 ప్రభుత్వ కాలేజీలు, 5 ప్రైవేట్ కాలేజీలలోని సీట్లను పూర్తి స్థాయిలో భర్తీ చేయడం విశేషం. కాగా ఈ కౌన్సెలింగ్లో సీట్లు లభించిన విద్యార్థులు ఈ నెల 31వ తేదీ లోపు ఆయా కాలేజీలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ సూచించారు. ఇక పాలిసెట్-2022 తుది విడత ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది.
టీఎస్ పాలిసెట్-2022 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్:
- ఆగస్టు 1 నుంచి పాలిసెట్-2022 తుది విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం.
- ఆగస్టు 1న ధ్రువీకరణపత్రాలు, సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుకింగ్.
- ఆగస్టు 2న సర్టిఫికెట్ల పరిశీలన.
- ఆగస్టు 1 నుంచి 3 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు.
- ఆగస్టు 6 న తుది విడత పాలిటెక్నిక్ సీట్లు కేటాయింపు.
- ఆగస్టు 6 నుంచి 10 వరకు కేటాయించిన కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.
- ఆగస్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల విధి విధానాలు వెల్లడి.
- ఆగస్టు 8 నుంచి 16 వరకు ఓరియెంటేషన్ కార్యక్రమాలు.
- ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY