తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దృష్ట్యా జూలై 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ (ఏఎం)-2022 (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షను, జూలై 13న జరగాల్సిన టీఎస్ ఈసెట్-2022 ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షల రీషెడ్యూల్ తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి మంగళవారం నాడు ప్రకటించింది. టీఎస్ ఎంసెట్-2022 అగ్రికల్చర్ పరీక్షలను జూలై 30, 31వ తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరగనున్నాయి.
ఇక ఈసెట్-2022 పరీక్షను ఆగస్టు 1వ తేదీన, టీఎస్ పీజీఈసెట్ పరీక్షను ఆగస్టు 2 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షల షెడ్యూల్ లో మార్పును అభ్యర్థులు గమనించాలని, అలాగే హాల్ టికెట్స్ ను త్వరలో డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్ సైట్స్ ను సందర్శించించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఒక ప్రకటనలో సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY