ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలును నిర్వహించనున్నట్టు యాదాద్రి ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ వివరాలు తెలిపేందుకు ఫిబ్రవరి 20, గురువారం నాడు ఆలయ ఈవో గీత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో గీత వెల్లడించారు.
యాదాద్రి బ్రహ్మోత్సవ నిర్వహణ వివరాలు:
- ఫిబ్రవరి 26 – బ్రహ్మోత్సవాలు మొదలు
- ఫిబ్రవరి 27 – ధ్వజారోహణం
- ఫిబ్రవరి 28 – శేషవాహన సేవ
- ఫిబ్రవరి 29 – హంసవాహన సేవ
- మార్చ్ 1 – పొన్న వాహన సేవ
- మార్చ్ 2 – సింహవాహన సేవ
- మార్చ్ 3 – ఎదుర్కోలు
- మార్చ్ 4 – కళ్యాణం
- మార్చ్ 5 – రథోత్సవం
- మార్చ్ 6 – మహా పూర్ణాహుతి మరియు చక్రతీర్ధం
- మార్చ్ 7 – అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగింపు.
[subscribe]