తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై గత కొన్ని రోజులుగా ఇరురాష్ట్రాలకు సంబంధించిన పలువురు నేతలు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల కూడా స్పందించారు. “తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం” అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అలాగే ఈ అంశంపై ఇటీవల ఓ సభలో తానూ మాట్లాడిన వీడియోను కూడా జతచేశారు. “చాలామంది ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా, పోరాడుతోందా, తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులను అడ్డుకుంటుందా అని అనుకోవచ్చని, మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెప్తున్నాను, తెలంగాణకు దక్కాల్సిన ఒక్కచుక్క నీటి బొట్టును కూడా వదులుకోము. తెలంగాణకు అన్యాయం జరిగే ఏప్రాజెక్టునైనా, పనినైనా అడ్డుకుంటాం. తెలంగాణ ప్రజల కోసం నిలబడతా, వారికోసం కొట్లాడతా” అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ