తెలంగాణ రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు వైఎస్సార్టీపీ అధినేత్రి వైయస్ షర్మిల. కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన రైతు రుణ మాఫీ అమలుకు నోచుకోవటం లేదని షర్మిల ఆక్షేపించారు. కేసీఆర్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలవల్ల రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల దుయ్యబట్టారు. నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ భరోసా కూడా ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు.
వ్యవసాయానికి ఉన్న అన్ని రకాల సబ్సిడీలను తీసేశారని.. రైతులపై కేసీఆర్కు ఎందుకింత వివక్ష అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ షర్మిల. వయసుకు పరిమితం లేకుండా రైతులకు భీమా వర్తింపజేయాలన్నారు షర్మిల. ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను త్వరగా సరిచేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని షర్మిల తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా అందించడం లేదని షర్మిల విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ