వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. మార్చి 10వ తేదీ నుంచి పాదయాత్ర పునఃప్రారంభిస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 9న ఎన్నికల కోడ్ కారణంగా నల్గొండ జిల్లా కొండపాక గూడెం వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. అందుకే, ఇప్పుడు కొండపాక గూడెం గ్రామం నుంచే పాదయాత్రను కొనసాగించనున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో నామమాత్రపు ఉనికిలో ఉన్న తన పార్టీకి ఈ పాదయాత్ర ద్వారా జవసత్వాలు తేవాలని షర్మిల తలపోస్తున్నారు.
తెలంగాణాలో పార్టీ స్థాపించిన అనంతరం.. పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటానని షర్మిల ప్రకటించారు. అయితే, ఎన్నికల కోడ్ మరియు కోవిడ్ నిబంధనల కారణంగా అప్పుడు పాదయాత్రను కొనసాగించలేకపోయారు. అయితే, ప్రస్తుతం కోవిడ్ నియంత్రణలోకి రావడం, ఇంకా రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేంనందున పాదయాత్ర పునఃప్రారంభం చేయాలని ఆమె నిర్ణయించారు. ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణాలో సాధారణ ఎన్నికల నాటికి తన పార్టీని రేసులోకి తీసుకురావాలని షర్మిల భావిస్తున్నారు. పాదయాత్ర సక్సెస్ ని బట్టి ఆమె తదుపరి అడుగులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ