ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ కు స్వర్ణపతకం, అభినందించిన సీఎం కేసీఆర్

CM KCR Congratulates Nikhat Zareen on Winning Gold Medal in Womens World Boxing Championships in New Delhi,CM KCR Congratulates Nikhat Zareen,Nikhat Zareen on Winning Gold Medal,Womens World Boxing Championships,Womens World Boxing in New Delhi,Nikhat Zareen in Womens World Boxing,Mango News,Mango News Telugu,Telangana CM congratulates Nikhat Zareen,Telangana CM K Chandrashekhar Rao greets champion,Nikhat Zareen Latest News,Womens World Boxing Championships Latest Updates

న్యూఢిల్లీలోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతాకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను సీఎం కేసీఆర్ అభినందించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.

వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి, మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రపంచ చాంపియన్ పోటీల్లో తన కెరీర్ లో ఇది రెండవ బంగారు పథకం కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 14 =