ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 264 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 193 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44, విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 193 కేసులతో కలిపి జూన్ 16, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5280 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 15911 సాంపిల్స్ ని పరీక్షించగా 193 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే కోవిడ్ వలన కొత్తగా చిత్తూరులో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మరణించగా, ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 88 కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2851 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 81 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 2341 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 1203 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 564 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 237 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 214 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ 1440 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 6720 కి చేరింది.
#COVIDUpdates: 16/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5280 పాజిటివ్ కేసు లకు గాను
*2851 మంది డిశ్చార్జ్ కాగా
*88 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2341#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/u8zavjVpL1— ArogyaAndhra (@ArogyaAndhra) June 16, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu