ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ మూడోవారంలో జరగనున్నట్టు సమాచారం. జూన్ 11 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేక పోవడంతో మూడు నెలల వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈనెల చివరికి బడ్జెట్ వ్యయానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉంది.
మరోవైపు ఈనెల 19న రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరగనుండడంతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సి ఉన్నందువల్ల ఆ తేదికి సమీపంగా బడ్జెట్ సమాావేశాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో నిబంధనల అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలను ఎలా నిర్వహించాలనే అంశంపై ఇటీవలే సీఎం వైఎస్ జగన్ సమావేశాన్ని నిర్వహించి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, తదితరులకు కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu