ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ తమ అభ్యర్దులను ప్రకటించేయగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ఆ పనిని వీలయినంత త్వరగా చేయడానికి సిద్ధపడుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మూడో జాబితా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా 144 ఎమ్మెల్యే స్థానాలు,17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది .
ఇప్పటి వరకు రెండు జాబితాలను ప్రకటించిన చంద్రబాబు.. తొలి జాబితాలో జనసేనతో కలిపి 128 మంది అభ్యర్థులను, సెకండ్ జాబితాలో 16 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన నియోజకవర్గాలలో అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో కాస్త ఎక్కువగానే కసరత్తు చేయాల్సి వచ్చింది.
ఇక మూడో జాబితాలో 11 మంది ఎంపీ అభ్యర్థులను ఈరోజో, రేపో చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఆరు ఎంపీ స్థానాలను కొద్ది రోజులు పెండింగ్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ఎంపీ నియోజకవర్గాల్లో కొన్ని సిగ్మెంట్లలో మార్పులు చేయాలని బీజేపీ నేతలు కోరుతుండటంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ మూడో జాబితాలో నంద్యాల నుంచి బైరెడ్డి శబరి,శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు,విశాఖ పట్టణం నుంచి ఎం. భరత్,అమలాపురం నుంచి గంటి హరీశ్, విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని,గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్,నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు,ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాద్,అనంతపురం నుంచి బి.కె. పార్థసారథి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE