ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 13, మంగళవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలు సిద్ధం చేసి, కేబినెట్ హ్యాండ్ బుక్లో వివరించిన విధంగా నిర్దేశించిన ఫార్మాట్ లో డిసెంబర్ 9, సాయంత్రం 4 గంటల లోపు పంపాలని వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాలు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు, విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం సహా పలు అంశాలపై కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE