ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 14, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీలో చర్చించే అంశాల ప్రతిపాదనలు సిద్ధం చేసి, కేబినెట్ హ్యాండ్ బుక్లో వివరించిన విధంగా నిర్దేశించిన ఫార్మాట్ లో మార్చి 10, సాయంత్రం లోపు పంపాలని వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
మరోవైపు మార్చి 14వ తేది నుంచే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 14 ఉదయం ఏపీ ఉభయసభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం మొదటి రోజు ఉభయసభలు వాయిదా పడ్డాక సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై రాష్ట్ర బడ్జెట్ 2023-24కి ఆమోదం తెలపడంతో పాటుగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE