జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సత్తా చాటారు. డిజిటల్ టెక్నాలజీ సభ-2022 అందించే వివిధ విభాగాల్లో ఏపీ పోలీస్ 15 అవార్డులను గెలుచుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అవార్డులను సాధించిన సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 165 అవార్డులు గెలుచుకుని రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎనిమిది, తిరుపతి అర్బన్ రెండు, కడప, చిత్తూరు, అనంతపురం ఒక్కొక్కటి చొప్పున, మరో రెండు జిల్లా యూనిట్లు ఒక్కో అవార్డును గెలుచుకున్నాయి. ఏపీ డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డులను గెలుచుకున్న టెక్నికల్ టీమ్ను అభినందించారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సేవలందించడంపై అధికారులు దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
డిజిపి కార్యాలయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పోలీసు శాఖ అతి తక్కువ కాలంలోనే 165 జాతీయ అవార్డులను గెలుచుకుందని అన్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోందని అన్నారు. అలాగే, జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం.. మాకు సంతోషంతో పాటు బాధ్యతను కూడా మరింతగా పెంచిందని డీజీపీ తెలిపారు. టెక్నాలజీ సభలో అందించిన అవార్డులు.. బాడీ-వోర్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్, APOLIS, GIS-ఆధారిత GPS సిస్టమ్, దిశ-కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రేడియో, HAWK వెహికల్, వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ మరియు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కేటగిరీలకు చెందినవి ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ