ఉక్రెయిన్‌-రష్యా క్రైసిస్: ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్

Ukraine-Russia Conflict PM Narendra Modi Speaks to Ukraine President Volodymyr Zelenskyy, PM Narendra Modi Speaks to Ukraine President Volodymyr Zelenskyy, PM Narendra Modi, Ukraine President, Ukraine President Volodymyr Zelenskyy, Volodymyr Zelenskyy, President Volodymyr Zelenskyy, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, Ukraine News, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో పలు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌ కు మద్ధతుగా నిలుస్తున్నాయి. తమ దేశంలో నెలకున్న పరిస్థితులను వివరిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పలు దేశాధినేతల మద్ధతు కోరుతున్నారు. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. ఉక్రెయిన్‌ తిప్పికొడుతున్న రష్యా దూకుడు గురించి తెలియజేసాను. 100,000 కంటే ఎక్కువ మంది ఆక్రమణదారులు మా భూమిపై ఉన్నారు. వారు నివాస భవనాలపై కూడా కాల్పులు జరుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మాకు రాజకీయ మద్దతు ఇవ్వాలని భారత్ ను కోరాను. కలిసికట్టుగా దురాక్రమణదారుని ఆపుదాం!” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్వీట్ చేశారు.

అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడుతో ఫోన్ సంభాషణపై ప్రధాని కార్యాలయం ప్రకటన చేసింది. “ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ పరిస్థితుల గురించి ప్రెసిడెంట్ జెలెన్స్కీ వివరంగా ప్రధానికి వివరించారు. కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినందుకు ప్రధాని మోదీ తన తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. హింసను తక్షణమే నిలిపివేయాలని మరియు చర్చలకు తిరిగి రావాలని ప్రధాని తన పిలుపుని పునరుద్ఘాటించారు. శాంతి ప్రయత్నాలకు ఏ విధంగానైనా సహకరించడానికి భారతదేశం సుముఖత వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయ పౌరుల రక్షణ మరియు భద్రత పట్ల భారతదేశం యొక్క ఆందోళనను కూడా ప్రధాని తెలియజేశారు. భారతీయ పౌరులను త్వరితగతిన మరియు సురక్షితంగా తరలించడానికి ఉక్రెయిన్ అధికారులను సులభతరం చేయాలని ప్రధాని కోరారు” అని ప్రకటించారు.

కాగా ఉక్రెయిన్‌ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్) ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌ కు భారతదేశం దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా మరియు అల్బేనియా పెట్టిన ఈ తీర్మానంపై భద్రతా మండలిలో మొత్తం 11 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, భారత్ సహా చైనా, యూఏఈ దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. కాగా భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశమైన రష్యా తీర్మానాన్ని నిరోధించేందుకు తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. దీంతో తీర్మానం వీగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత్ మద్ధతు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =