తెలంగాణ లోని నల్లగొండ జిల్లాలో ఈరోజు (శనివారం) ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా చెలకుర్తి, తుంగతుర్తి గ్రామాల మధ్య పొలాల్లో ఒక శిక్షణ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్తో పాటు ట్రైనీ పైలట్ మృతి చెందారు. పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద శిక్షణ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. శిక్షణ హెలికాప్టర్ కూలినట్లు ఎయిర్ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు. కాగా, తుంగతుర్తి గ్రామం వద్ద వ్యవసాయ భూముల్లో పని చేస్తున్న రైతుల నుంచి హెలికాప్టర్ కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని నల్గొండ పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు.
సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వ్యవసాయ భూముల వద్ద ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు హెలికాప్టర్కు తగిలి ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, వైద్యుల బృందాన్ని కూడా ఘటనాస్థలికి పిలిపించారు. ఈ ఛాపర్ నాగార్జున సాగర్లోని ఫ్లైటెక్ ఏవియేషన్కు చెందిన ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందినది. ట్రైనీ పైలట్ తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించారు. ఆమె ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. విమానం కూలిన సమయంలో భారీ శబ్దంతో పాటు దట్టమైన మంటలు, పొగలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ