గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష(19)ను తోటి విద్యార్థి విష్ణువర్ధన్రెడ్డి హతమార్చాడు. ముందుగా మాట్లాడుకుందామని చెప్పి అనూషను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి గోవిందపురం మేజర్ కాలువ దగ్గర గొంతు నులిమి హత్య చేసి కాలువలోకి పడేశాడు. అనంతరం నిందితుడు విష్ణువర్ధన్రెడ్డి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
నరసరావుపేట విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం : సీఎం జగన్
ఈ నేపథ్యంలో ఈ ఘటన వివరాలను సీఎంఓ అధికారులను అడిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. నరసరావుపేటలో విద్యార్థిని అనూష హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను దిశ కేసు కింద దర్యాప్తు చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. అలాగే అనూష కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ