టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటుగా కుప్పంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు కుప్పం చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
చివరిగా గత ఏడాది ఫిబ్రవరిలో చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఏడాది అనంతరం పర్యటనకు వస్తున్న ఆయన నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై నాయకుల అభిప్రాయాలు సేకరించి, సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చంద్రబాబు ఇప్పటికే సమీక్ష జరిపారు. కాగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో పార్టీ గెలుపుపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ