భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ-డీ2) ను ప్రయోగించింది. ప్రయోగించిన కొద్దిసేపటికే ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ మూడు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం ఎస్ఎస్ఎల్వీ-డీ2/ఈఓఎస్-07 మిషన్ విజయవంతంగా చేయబడిందని, ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ ఈఓఎస్-07, జానూస్-1 మరియు అజాదిశాట్-2లను వాటి నిర్దేశించిన కక్ష్యల్లోకి చేర్చిందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగం విజయవంతం నేపథ్యంలో ఇస్రో బృందానికి/శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది. “ఎస్ఎస్ఎల్వీ-డీ2 ని విజయవంతంగా ప్రయోగించినందుకు, దేశం యొక్క అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లినందుకు ఇస్రో బృందానికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్ట్తో అనుబంధించబడిన ఇస్రో బృందం మరియు యువకులు వారి భవిష్యత్ ప్రయత్నాలలో మరింత విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE