ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమెరికా నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది అమెరికాలో ‘నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్’ (నాటా) ఆధ్వర్యంలో జరుగనున్న తెలుగు మహా సభలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిందిగా ఆయన ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి మరియు ఇతర సభ్యుల బృందం సీఎం జగన్కు ఆహ్వాన పత్రం అందించారు. ఈ క్రమంలో సోమవారం నాటా అసోసియేషన్ సభ్యులు సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించారు. అనంతరం అమెరికాలో తాము నిర్వహించే మహా సభలకు హాజరు కావాలంటూ ఆయనకు ఇన్విటేషన్ లెటర్ అందజేశారు. కాగా 2023 జూన్ 30 – జులై 02 వరకు డాలస్లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో నాటా మహా సభలు జరుగనున్నట్లు వారు సీఎం జగన్కు వివరించారు. కాగా నాటా ప్రతినిధుల ఆహ్వానంపై సీఎం జగన్ సుముఖత వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE