ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు గృహనిర్మాణ శాఖపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నూతన మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. అలాగే గృహనిర్మాణ శాఖ విభాగంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. లక్ష్యాలను సవాల్గా తీసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే సిద్ధం చేసిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి పేదల ఇంటి కలను నెరవేర్చాలని పేర్కొన్నారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణశాఖ మంత్రి మంత్రి జోగి రమేష్ తో పాటు సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
2024 నాటికి పేదల ఇంటి కలను నెరవేర్చేలా ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంట్లో.. ఒక పడక గది, ఒక వంట గది, వరండా, టాయిలెట్ ఉంటాయి. అలాగే సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ అధికారులు కొన్ని ఇళ్ల నమూనా డిజైన్లను ప్రదర్శించి చూపారు. ఆ నమూనాలను పరిశీలించిన అనంతరం సీఎం జగన్ కొన్ని మార్పులు సూచించారు. కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ, నీటి సౌకర్యం, విద్యుత్తు వంటి కనీస వసతులు కల్పించాలని, మొక్కలు నాటాలని అన్నారు. గృహనిర్మాణ శాఖలో 4,500 మంది ఇంజనీర్లు మరియు గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది అందరూ కలిసి ఈ గృహనిర్మాణ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ