హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 5న శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని 216 అడుగుల ఎత్తు గలిగిన పంచలోహ శ్రీరామానుజాచార్య విరాట్ (సమతామూర్తి) విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకునేందుకు రోజువారీగా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 7, సోమవారం నాడు హైదరాబాద్ చేరుకొని, ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, 4.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడ నుంచి 5 గంటలకు ఆశ్రమానికి చేరుకుని సమతామూర్తిని దర్శించుకోనున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి రాత్రి 9.05 గంటలకు సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆరో రోజు కార్యక్రమాలు:
- ఉదయం ఇష్టిశాలలో అకాలవృష్టినిష్టి వారణకై, సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి
- ప్రవచనమండపమంలో శ్రీకృష్ణ అష్టోత్తరశత నామపూజ, ప్రవచనములు
- సాయంత్రం ప్రవచనమండపమంలో ముఖ్యఅతిథుల సందేశములు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ