హైదరాబాద్ ముచ్చింతల్లో జరుగుతున్న శ్రీరామనుజ సహస్రాబ్ది వేడుకల్లో సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి చిన జీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమం వేదికగా జరుగుతున్న ఈ వేడుకలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈక్రమంలోనే పలువురు ప్రముఖులు ఇక్కడి క్షేత్రాన్ని దర్శించి, సమారోహ పూజలలో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈనెల 5న (శనివారం) ఈ వేడుకలకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా.. జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న (ఆదివారం) ఇక్కడకు విచ్చేసారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు.
తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రతిష్టించిన 216 అడుగుల శ్రీ రామానుజాచార్య ‘సమతామూర్తి‘ విగ్రహాన్ని దర్శించుకున్నారు. దర్శన అనంతరం చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీరామానుజాచార్య క్షేత్రాన్ని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోదీ విగ్రహావిష్కరణ చేయడంపై స్పందిస్తూ.. ఆ అర్హత కేవలం ప్రధాని మోదీకే ఉందని స్పష్టం చేశారు. మన తెలుగువారికి అందుబాటులో ఇలాంటి అద్భుత ఆశ్రమం ఏర్పాటు చేసిన చిన జీయర్ స్వామి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ