తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రులు, పార్టీ కీలక నేతలు, 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ప్రగతిభవన్ లో జరగనుంది. సీఎం కేసీఆర్ అక్టోబర్ 5న విజయదశమి సందర్భంగా జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
అక్టోబర్ 5న తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఏర్పాటుకు సంబంధించి నేడు పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. అలాగే జాతీయ పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కసరత్తు తుదిదశకు చేరినట్టు తెలుస్తుంది. నేటి కీలక సమావేశంలో జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండాలపై కూడా చర్చలు జరిపి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY