ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని సంగం, పెన్నా బ్యారేజ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 30వ తేదీన ప్రారంభిస్తామని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన పెన్నా బ్యారేజ్ పనులను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిధుల కేటాయింపుతో ఈ రెండు బ్యారేజ్ పనుల్లో వేగం పెరిగిందని, ఈ క్రమంలో ఆగస్ట్ 30వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో ఈ సంగం, పెన్నా బ్యారేజ్లకు శంకుస్థాపన చేశారని గుర్తు చేసిన అనిల్ కుమార్, ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ నేతృత్వంలో బ్యారేజ్ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY