ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై పంచాయితీ క్లైమాక్స్కు చేరింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను సీఎం జగన్ నోట్ చేసుకున్నారు. అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. వీలైనంతగా మంచి చేయాలన్న తపనతోనే ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా.. దయచేసి అందరూ ప్రాక్టికల్గా ఆలోచించాలని, సానుకూల దృక్పథంతో ఉండాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు జగన్.
రాష్ట్రంలో గత 2 నెలులుగా పీఆర్సీపై పంచాయితీ నడుస్తోంది. అశుతోష్ మిశ్రా నివేదిక కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు కూడా నిర్వహించారు. అయినా సరే, ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆ తర్వాత, ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టి, వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేశాయి. ఈ తరుణంలోనే, ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా వారితో చర్చలు జరిపారు. ఈలోపే సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. 14.29 ఫిట్మెంట్ ఇస్తే చాలని ప్రభుత్వానికి సూచించింది.
అయితే, దీనిపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తుంటే…ఫిట్మెంట్ని 14.29గా ఎలా సూచిస్తారంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది ప్రభుత్వం. ఫైనల్గా 40 నుంచి 55 శాతం ఫిట్మెంట్కు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంత ఇవ్వడం సాధ్యం కాదంటోంది ప్రభుత్వం. 14 నుంచి 27 శాతం మధ్యలో ఫిట్మెంట్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ