తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం ఆయన మరణాన్ని వైద్యులు నిర్ధారించారు. గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడినుంచి ఆయన వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. ఆరోగ్యం సహకరించకపోవడంతో గత ఎన్నికల నుంచే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కాబినెట్లో అటవీశాఖ మంత్రిగా సేవలందించారు. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాలలోకి వచ్చిన ఆయన చివరి వరకు పార్టీలోనే కొనసాగారు. తిరుపతి అలిపిరి ఘటనలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సలైట్లు మందుపాతర పేల్చిన ఘటనలో బాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. కాగా బొజ్జల మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పార్టీకి తీరనిది అని, కష్టకాలంలో తనకు మరియు పార్టీకి అండగా ఉన్నారని చంద్రబాబు బొజ్జలనుద్దేశించి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ