బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నవంబర్ 28వ తేదీ నుంచి రాష్ట్రంలో ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 28 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. భైంసాలో ఐదో విడత పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని, ఈ విడతలో ముథోల్ నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర ఉంటుందని చెప్పారు. కాగా యాత్రకు సంబంధించి ఇంకా పూర్తి షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ముందుగా అక్టోబర్ 15 నుంచే బండి సంజయ్ తన ఐదో విడత యాత్రను ప్రారంభించాలని భావించినప్పటికీ, మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఇటీవల పరిణామాలపై బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తో ఎలాంటి యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ కంటే ముందే యుద్ధం ప్రారంభించామని అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్లు లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE