ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, రేపు (జనవరి 30, 31 తేదీల్లో) ఢిల్లీలో పర్యటించనున్నారు. జనవరి 30, సోమవారం సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్ బయలుదేరి, సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. సోమవారం రాత్రికి జన్పథ్-1 నివాసంలో సీఎం బస చేయనున్నారు. ఇక జనవరి 31, మంగళవారం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్రైజర్ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హెటల్ లో ఉదయం 10.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పలువురు దౌత్యవేత్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఇక మంగళవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనను ముగించుకుని, తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE