దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా భావోద్వేగపు ట్వీట్ చేశారు. “చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం, పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం, మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం, నీ ఆశయాలే నాకు వారసత్వం, ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా…పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా…జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.” అంటూ తన తండ్రిని స్మరించుకుంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ