దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కడపజిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. వైస్సార్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భర్త అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి వైఎస్ షర్మిల గంట పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల “వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ”ని అధికారికంగా ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఆమె తండ్రి సమాధిపై ఉంచారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఇడుపులపాయకు తరలీ వచ్చిన కార్యకర్తలను, నాయకులను వైఎస్ షర్మిల పలకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ