ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ దంపతులు తమ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి కాన్వొకేషన్ వేడుకలో పాల్గొన్నారు. పారిస్లో ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో హర్ష మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈ క్రమంలో జూలై 2న జరిగిన ఇన్సీడ్ బిజినెస్ కాన్వొకేషన్ వేడుకకు తమ కుమార్తెతో కలిసి సీఎం వైఎస్ జగన్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుమార్తె మాస్టర్స్ డిగ్రీ అందుకోవడంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ, కుమార్తె హర్ష, సతీమణి భారతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
“డియర్ హర్ష, నీ ఎదుగుదలను చూడటం అద్భుత ప్రయాణం. దేవుడు ఎంతో దయ చూపాడు. ఈ రోజు నీవు ఇన్సీడ్ నుండి డిస్టింక్షన్తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, డీన్స్ జాబితాలోనూ చోటు సంపాదించడం చూసి నేను గర్వపడుతున్నాను. నీకు భవిష్యత్తులో భగవంతుడు అంతా మంచి చేయాలని కోరుకుంటున్నాను” అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY