హైదరాబాద్లో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో పాల్గొనడం కోసం తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోజు హాలీడే ఇచ్చింది. అలాగే ఎన్నికల రిజల్ట్ వచ్చే రోజు జూన్ 4న కూడా వేతనంతో కూడా సెలవును ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో.. ఆ రోజు ఈ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని గవర్నమెంటు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో 2024 లోక్సభ ఎన్నికలు మే 13న జరగనుండగా ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. మరోవైపు తెలంగాణలో తీవ్ర వడగాలుల కారణంగా 12 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని కూడా ఒక గంట పొడిగించారు. అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.
మల్కాజిగిరి లోక్సభ స్థానంలో భాగంగా ఉన్న.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఓటర్లు మే 13న రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి లోక్సభ ఎన్నికలకు కాగా, మరొక ఓటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు వేయాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత..ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో ఖాళీ అయిన ఆ స్థానానికి లోక్ సభ ఎన్నికలతో పాటు మే 13న బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు.
మరోవైపు మే 13న జరిగే ఎన్నికల కోసం ఈసీ అధికారులు 3,986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 23,500 మంది ఉద్యోగులను సిబ్బందిగా నియమించారు. ఓవైపు అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్న ఈసీ.. సామాజిక మాధ్య మాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే శిక్ష తప్పదని అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY