గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ ప్రకటన, డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు వంటి అంశాలపై నిరసనలు తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ముఖ్య అధికారులతో కూడా చర్చలు సాగుతున్న వేళ వారికి ఈ రోజు సీఎం జగన్ తీపి కబురు అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఈ రోజు తిరుపతిలో సీఎం జగన్ ను ఉద్యోగులు కలిశారు. పీఆర్సీ పై ప్రకటన చేయాలని వారు ఆయనను కోరగా, ప్రక్రియ పూర్తి అయిందని, మరో 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ