సీఎం జగన్‌ను కలిసిన క్రిబ్‌కో ఛైర్మన్‌ చంద్రపాల్‌ సింగ్‌.. నెల్లూరులో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు ఆహ్వానం

KRIBHCO Chairman Chandrapal Singh Yadav Invites CM Jagan For Bioethanol Plant Inauguration at Nellore, KRIBHCO Chairman Chandrapal Singh Yadav, Bioethanol Plant Inauguration at Nellore, Bioethanol Plant Inauguration By AP CM, Mango News, Mango News Telugu, Chandrapal Singh Yadav Invites CM Jagan, Chandrapal Singh Yadav KRIBHCO Chairman, KRIBHCO Chairman, KRIBHCO Chairman Chandrapal Singh Yadav, AP CM Bioethanol Plant Inauguration, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్రిబ్‌కో ఛైర్మన్‌ చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌ కలిశారు. ఆయనతోపాటు క్రిబ్‌కో వైస్ ఛైర్మన్‌ వల్లభనేని సుధాకర్, ఎండీ రాజన్ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్‌కో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు. సుమారు రూ. 300 కోట్ల పెట్టుబడితో ఈ బయో ఇథనాల్‌ ప్లాంట్‌ మొదటి దశ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చంద్రపాల్‌ సింగ్‌ సీఎం జగన్‌కు వివరించారు. అలాగే డీఏపీ కాంప్లెక్ ఎరువుల తయారీ కోసం మరో ప్రాజెక్టుని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రపాల్‌ సీఎం దృష్టికి తెచ్చారు.

కాగా చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌ ఆహ్వానం పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని, ఎవరైనా పెట్టుబడుల ప్రతిపాదనతో ముందుకొస్తే త్వరితగతిన అన్ని అనుమతులు ఇస్తామని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =