ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యవహారం సెగలు రేపుతోంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది చనిపోయినట్లుగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కానీ అవి సహజ మరణాలని ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. దీనిపై శాసనసభ, శాసనమండలిలో ప్రతిరోజూ టీడీపీ నిరసనలు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో మద్యం అమ్మకాలను ప్రొత్సహించింది చంద్రబాబు నాయుడేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం కంపెనీలలో చాలావరకు టీడీపీ నాయకులవేనని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగానే ఎన్నికల సమయంలో మద్యం నియంత్రణపై హామీ ఇచ్చారని, దానిప్రకారమే అధికారంలోకి రాగానే 45 వేల బెల్టుషాపులు తొలగించారని గుర్తుచేశారు. సీఎం జగన్ మద్యం విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఒకప్పుడు రాష్ట్రంలో బార్లకి కేవలం రెండేళ్లే అనుమతులు ఉండేవని, చంద్రబాబు వచ్చాకే ఐదేళ్లకి పెంచారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక టీడీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను బయట ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి గుణపాఠం చెబుతారని మంత్రి కొడాలి నాని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ