ఈ రోజు అమరావతిలో.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. కొద్దిసేపటిక్రితం మంత్రితో వర్మ భేటీ ముగిసింది. అయితే మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందుకు రాంగోపాల్ వర్మ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదని, లేఖలు, ఇతరత్రా కామెంట్స్పై మాట్లాడేందుకు తాను రాలేదన్నాడు. కేవలం సినిమా దర్శకుడిగానే మంత్రి పేర్ని నానిని కలుస్తున్నానని, సినిమా టికెట్ల ధరల అంశంపై తన అభిప్రాయం ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపాడు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం అని ఆర్జీవీ అన్నాడు. కాగా నేడు (సోమవారం) ఉదయం వర్మ హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి కారులో అమరావతి చేరుకున్నాడు.
ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచాలనే సినిమా ఇండస్ట్రీ డిమాండ్కు ఆర్జీవీ మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆర్జీవీ చేసిన కొన్ని ట్వీట్లపై మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. ఈ వ్యవహారంపై చర్చిద్దామని అన్న మంత్రి నాని, వర్మకు సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. రాంగోపాల్ వర్మ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆర్జీవీని భారీ బందోబస్తు నడుమ ఎయిర్పోర్టు నుంచి పోలీసులు వెలగపూడి సచివాలయానికి తీసుకెళ్లారు. ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పేర్ని నానితో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. ఆయనకు ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తాను. ఒక ఫిల్మ్ మేకర్గా మాట్లాడడానికి వచ్చాను. ఎవ్వరు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు. నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి వచ్చాను’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ