కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కూడా మరి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చే దిశగా ఆలోచనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులను తిరిగి నడపనున్నారని, ఆర్టీసీ చార్జీలు కూడా భారీగా పెంచుతున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఆర్టీసీ చార్జీలు పెంచే విషయంపై వివరణ ఇచ్చారు.
లాక్డౌన్ తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో భారీగా చార్జీలు పెంచుతారనేది అవాస్తవమని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇలా తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మే 17 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు నడుచుకుంటామని, వారు ప్రజారవాణా ప్రారంభించి బస్సులు నడపమని ఆదేశాలు ఇస్తే వెంటనే బస్సులు నడుపుతామని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu