కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్స్ పై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ లో 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్స్ లో కాపులకు 5 శాతం కోటా కేటాయించిందని, ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన 33/2017 కాపు రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలని లేఖలో కోరారు. గడిచిన 50 సంవత్సరాలనుండి వచ్చిన ప్రభుత్వాలు అన్ని కాపులకు రిజర్వేషన్స్ కల్పిస్తామని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నాయని చెప్పారు. ఓట్ల కోసమే కాపులని వాడుకుంటున్నారని, తక్షణమే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదించాలని ప్రధానికి రాసిన లేఖలో ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.
[subscribe]
[youtube_video videoid=evwjAvuYlSk]