నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా అంశంపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. “నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వెయ్యాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయాకు లేఖ రాసాను. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం లేకుండా పోయింది. మే 21 నే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించడం వలన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు” అని నారా లోకేష్ పేర్కొన్నారు.
నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వెయ్యాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ @mansukhmandviya గారికి లేఖ రాసాను.(1/3) pic.twitter.com/4S5qx7FNUL
— Lokesh Nara (@naralokesh) May 5, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ