అనుమానించిన చోట ఉండలేక నీతిగా, నిజాయితీగా చెప్పి మరీ బయటకు వెళ్తున్నా – ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy Sensational Comments on YCP Govt Over Phone Taping Issue,Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy,MLA Kotamreddy Sridhar Reddy,Sensational Comments on YCP,Kotamreddy Sridhar Reddy,YSRCP General Secretary,Sajjala Ramakrishna Reddy,MLA Kotamreddy,Mango News,Mango News Telugu,Having endured many insults in party,with admiration for CM Jagan Nellore MLA Kotam Reddy's,Kotam Reddy sensational comments,mango news,mango news telugu,Ap It Minister Gudivada Amarnath,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంతపార్టీపై, ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయడంతో మొదలైన వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేసిన కోటంరెడ్డిపై సొంతపార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. టీడీపీ లోకి వెళ్ళడానికి ఎమ్మెల్యే నిర్ణయించుకుని, వెళ్తూ వెళ్తూ ప్రభుత్వంపై ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ నేతల వ్యాఖ్యలపై కోటంరెడ్డి తాజాగా శుక్రవారం మరోసారి మీడియా సమావేశం నిర్వహించి ధీటుగా బదులిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అనుమానించిన చోట ఉండలేక నీతిగా, నిజాయితీగా చెప్పి మరీ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. ఇంకో 15 నెలల అధికారం వదులుకోవడానికి కూడా సిద్దమని, కానీ మనస్సు చంపుకుని పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. నేను చేసిన ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలపై వైసీపీ పార్టీ నేతలు కోరిన మీదట నా దగ్గరున్న ఆధారాలు బయటపెట్టానని తెలిపారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ చేయించి నిజానిజాలను ప్రజల ముందు ఉంచి ఉంటే బావుండేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

అధికార పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేయడమంటే అంత సులువు కాదని, పెద్దల ఆదేశాలు లేనిదే అధికారులు స్వయంగా చేయలేరని కోటంరెడ్డి వివరించారు. ఇవన్నీ చూసి తన మనసు విరిగిపోయిందని, అందుకే పార్టీనుంచి వెళ్లిపోవడానికి సిద్దపడ్డానని తెలిపారు. ఇక తనపై కేసులు పెట్టొచ్చని, త్వరలోనే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని లీకులిస్తున్నారని, ఇలాంటివాటికి బెదిరేవాడిని కానని, విద్యార్థి దశనుంచి 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నానని వెల్లడించారు. అధికారం మీ చేతిలో ఉంది, నన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, కావాలంటే శాశ్వతంగా జైల్లో పెట్టించండని వ్యాఖ్యానించారు. తనపై కేసులు పెట్టినా, తనను జైల్లో పెట్టినా.. వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. తన ప్రశ్నలకు సమాధానాలు వచ్చేవరకూ తన గొంతు ప్రశ్నిస్తూనే ఉంటుందని, తన గొంతు ఆగాలంటే ఒక్కటే మార్గమని, తనను ఎన్ కౌంటర్ చేయడమొక్కటేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 19 =