అభ్యర్ధి మార్పు లేదన్న రఘురామకృష్ణరాజు

Narasapuram candidate, Raghuramakrishna Raju, YCP, TDP, Janasena, BJP, Chandrababu, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Andhra Pradesh, AP, Mango News Telugu, Mango News
Narasapuram candidate,Raghuramakrishna Raju, YCP,TDP, Janasena, BJP, Chandrababu,

ఏపీ సీఎం  కల, ఇప్పుడు కల్లే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. తాను నరసాపురం స్థానం నుంచే రాబోయే ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానంటూ  మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాజాగా రచ్చబండలో మాట్లాడిన ఆయన..కొన్ని నీలి చానల్స్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, తనను తప్పించే ప్రయత్నాలు చేయడానికి చేసినా తాను నరసాపురం లోక్ సభ స్థానం నుంచే  పోటీ చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

తాను ప్రజల నుంచి వచ్చిన నేతను అని,ప్రజాభిమానం కలిగినవాడననని..తనను  ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికలలో బీజేపీ, టీడీపీ పొత్తు లేకుండా చేయాలని ఏపీ సీఎం జగన్ చేసిన విశ్వప్రయత్నాలు చేసినట్లు రఘురామ బయటపెట్టారు.

చివరకు కూటమి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నాలుగు రోజుల ముందు కూడా, పొత్తు పెట్టుకోవద్దంటూ బీజేపీ నాయకత్వాన్ని జగన్ బ్రతిమాలారంటూ రఘురామ వివరించారు. అంతేకాదు కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా నరసాపురం టికెట్‌ను తనకు  ఇవ్వొద్దంటూ జగన్ ఎన్ని ప్రయత్నాలు చేశారో తనకు తెలుసని అన్నారు. పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని బీజేపీ తీసుకుంటుందని రఘరామ అన్నారు.

తనకు టికెట్ రానివ్వకుండా చేస్తేనే,గెలుస్తామని జగన్భా విస్తున్నప్పుడు,టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి నాయకులకు ఆ మాత్రం వ్యూహం ఉండదా? అని సెటైర్ వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డిని కూడా..ఆమె వైఎస్సార్  కూతురే కాదని ఒక వైసీపీ నేతతో ఘోరంగా అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.మొత్తంగా అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో తెలియదు కానీ రఘురామకృష్ణరాజు మాత్రం తన పోటీపై క్లారిటీ ఇచ్చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =