ఏపీలో ప్రవేశించిన రాహుల్ గాంధీ పాదయాత్ర.. ఘనస్వాగతం పలికిన ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ సహా కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi's Bharat Jodo Yatra Enters AP Today PCC Chief Sailajanath and Other Congress Leaders Grand Welcomes, Rahul Gandhi's Bharat Jodo Yatra Enters AP, PCC Chief Sailajanath Welcomes Rahul Gandhi, Congress Leaders Welcomes Bharat Jodo Yatra, Mango News, Mango News Telugu, Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates, AP Bharat Jodo Yatra

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ శుక్రవారం (14 అక్టోబర్, 2022) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈరోజు ఉదయం 7 గంటలకు కర్ణాటకలోని ఆంధ్రా సరిహద్దు జిల్లా చిత్రదుర్గ, రాంపురాలో ప్రారంభమైన ఆయన పాదయాత్ర అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ వద్ద ఏపీ లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు. కాగా కొద్దిసేపు విశ్రాంతి అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమై అనంతపురం జిల్లాలోని ఓబులాపురం వరకు నేడు యాత్ర కొనసాగనుంది. రాత్రికి బళ్లారిలోని హలకుంది మఠ్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. ఇక ఏపీలో మొత్తం 5 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. కాగా రాహుల్‌ గాంధీని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =