కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ శుక్రవారం (14 అక్టోబర్, 2022) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈరోజు ఉదయం 7 గంటలకు కర్ణాటకలోని ఆంధ్రా సరిహద్దు జిల్లా చిత్రదుర్గ, రాంపురాలో ప్రారంభమైన ఆయన పాదయాత్ర అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ వద్ద ఏపీ లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు. కాగా కొద్దిసేపు విశ్రాంతి అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమై అనంతపురం జిల్లాలోని ఓబులాపురం వరకు నేడు యాత్ర కొనసాగనుంది. రాత్రికి బళ్లారిలోని హలకుంది మఠ్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. ఇక ఏపీలో మొత్తం 5 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. కాగా రాహుల్ గాంధీని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY