విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్ రోడ్ లో ఈ నెల 25వ తేదీన ఘనంగా విగ్రహం ఆవిష్కరించాలని తొలుత ఏర్పాట్లుకు సిద్ధమయ్యారు. ప్రముఖ సినీనటుడు పద్మభూషణ్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ఆయన చేతుల మీదుగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్యకారణాల వలన ఈ కార్యక్రమం వాయిదా పడినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఎటువంటి కారణాలు తెలుపకుండా, త్వరలోనే మరో తేదిని ప్రకటిస్తామని చెప్పారు. అయితే విగ్రహావిష్కరణకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడం వలనే ఈ కార్యక్రమం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది.
[subscribe]
[youtube_video videoid=A314rC9aC4c]