ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని శనివారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, అక్కడి నుంచి గన్నవరం వచ్చారు. గన్నవరంలో రాష్ట్ర మంత్రి నారాయణస్వామి ముఖ్యమంత్రి జగన్ కు స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి స్వాగతం పలికారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 15వ తారీఖున అమెరికా వెళ్లి అక్కడి విదేశాంగ అధికారులతో సమావేశమయ్యారు, భారత రాయబారి ఇచ్చిన విందులో పాల్గొన్నారు. డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ అఫ్ నార్త్ అమెరికా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాడేపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలను చర్చించబోతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదురుకున్న వరదలు, పోలవరం రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తిరుపతి బస్సు టికెట్లపై అన్యమత ప్రచార వివాదాలపై మంత్రులు, అధికారుల నుండి వివరాలు సేకరించనున్నారు. తిరుపతి బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం వివాదం గురించి మంత్రి పేర్ని నాని, జగన్ కు వివరించనున్నారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=g3dJ7LDHL-c]